ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. –కొలస్సీ 1:16
పై వాక్యాలను బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే “యేసు
సృష్టి కర్త” అయి ఉన్నారు అన్నది. నిజానికి పై వాక్యాలలో పౌలు “సర్వమునూ
ఆయన ద్వారా సృజింపబడెను” అని చెప్పటాన్ని బట్టి సర్వమునూ యేసుకు వేరుగా దేవుడు
సృజించినట్టు తెలుస్తుంది. సరే, పౌలు అలా ఎందుకు ప్రకటించాడు? అన్నది
తెలుసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి.
సకల సృష్టి తన
ద్వారా చెయ్యబడిందని గానీ, సృష్టి నిర్మాణంలో తన భాగస్వామ్యం ఉందని గానీ
యేసు ఏనాడైనా ప్రకటించుకున్నారా?
సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను
కలుగ జేసెను. –మార్కు 10:6
దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. –మార్కు 13:19
యేసు స్వయంగా ప్రకటిస్తున్నవే పై వాక్యాలు. వాటిలో
గమనర్హమైన విషయం- యేసే స్వయంగా “దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి”, “దేవుడు
వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేసేను” అనటం. తప్పితే యేసు తనకు తానుగా సృష్టికర్తగా
భావించుకుని- “నేను సృజించిన సృష్ట్యాది నుండి”, “నేను వారిని పురుషునిగాను,
స్త్రీ గానూ కలుగజేశాను” అనటం లేదు. పోనీ త్రిత్వ దైవత్వ వాదులు చెబుతున్నట్టు యెహోవాతో పాటు యేసుకూడా
ఒక దేవుడై ఉంది ఆదిలో సృష్టి నిర్మాణం చేశారన్నదే నిజమైతే అప్పుడు కూడా యేసు
కచ్చితంగా- “మేము సృజించిన సృష్ట్యాది నుండి” అని, “మేము
వారిని పురుషునిగాను, స్త్రీ గానూ కలుగజేశాము” అని చెప్పి ఉండేవారు. కానీ యేసు తనకు అతీతంగా
ఉన్న యెహోవాను ఉద్దేశించి “దేవుడు సృష్ట్యాది నుండి సమస్తమూ సృజించాడ, స్త్రీ,
పురుషులను దేవుడే కలుగజేశాడని”ని చెప్పటాన్ని బట్టి యేసు దృష్టిలో సృష్టికర్త ఒక్క యెహోవా
మాత్రమే అని తెలుస్తుంది.